జూలై 29 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం

  • అంతర్జాతీయ పులుల దినోత్సవం (2010)
  • ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే.

◆ సంఘటనలు

1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.
1976: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
2015: ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు.

◆ జననాలు

1883: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.1945)
1904: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (మ.1993)
1931: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2017)
1975: కృష్ణుడు (నటుడు), తెలుగు సినీ నటుడు.
1975: లంక డిసిల్వా, శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
1984: డాక్టర్ శ్రీజ సాధినేని, తెలుగు చలనచిత్ర, టెలివిజన్ మరియు థియేటర్ నటి, యాక్టింగ్ ప్రొఫెసర్, రచయిత్రి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్. పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. 2003లో శ్రీజయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. 2012 నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

◆ మరణాలు

1890: విన్సెంట్ వాన్ గోహ్, డచ్ చిత్రకారుడు. (జ.1853)
1891: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (జ.1820)
1931: బిడారం కృష్ణప్ప, తాళబ్రహ్మ, గాన విశారద. (జ.1866)
1996: అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909)
2012: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు (జ.1929)
2019: కె.బి.లక్ష్మి తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. (జ.1953)
2019: ముఖేష్ గౌడ్, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి (జ.1959)