GROUP – 2 : ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ

హైదరాబాద్ (జూలై – 15) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) GROUP – 2 EXAM ను పేపర్ పెన్ను పద్దతి (OMR BASED) లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29, 30వ తేదీలలోన రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది.

మొత్తం 783 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు.

గ్రూప్-2 పరీక్షలు జరిగేపరీక్షా కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలకు ఆగస్టు 29, 30న సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవలే మెమో జారీచేశారు. పరీక్షా కేంద్రాలు లేని విద్యాసంస్థలు యధావిథిగా నడుస్తాయని పేర్కొన్నారు.

గ్రూప్-2 పరీక్ష పూర్తయితే ఇక.. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ తో పాటు గ్రూప్- 3 పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్-3,
గ్రూప్-1 రెండు పరీక్షలను అక్టోబర్, నవంబర్ నెలల్లో పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది..