చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 19

BIKKI NEWS : TODAY IN HISTORY SEPTEMBER 19th

TODAY IN HISTORY SEPTEMBER 19th

దినోత్సవం
  • తెలుగు మాధ్యమాల దినోత్సవం

జననాలు

1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973)
1905: చొప్పల్లి సూర్య నారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరి కథా కళాకారుడు, రంగ స్థల, సినిమా నటుడు.
1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (మ.2005)
1924: కాటం లక్ష్మీ నారాయణ, స్వాతంత్ర్య సమర యోధుడు, నిజాం విమోచన పోరాట యోధుడు. (మ.2010)
1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002)
1935: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిణి, నాసా వ్యోమగామి.
1970: రాజా రవీంద్ర , తెలుగు చలనచిత్ర నటుడు
1976: ఇషా కొప్సికర్ ,మోడల్, హిందీ, తెలుగు,తమిళ,కన్నడ, మరాఠీ ,భాషల నటి, రాజకీయ నాయకురాలు.
1980: మేఘన నాయుడు , భారతీయ సినీ నటీ.
1984: కావ్య మాధవన్, మలయాళ సినీనటి, గాయని, పాటల రచయిత .
1987: సూరజ్ సంతోష్ , గాయకుడు .

మరణాలు

1719: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి. (జ.1698)
1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) .
2014: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
2015: నడిచే గణిత విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభి రామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు