చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 17

★ దినోత్సవం

  • తెలంగాణ విమోచన దినోత్సవం
  • విశ్వకర్మ జయంతి
  • మహిళల మైత్రీ దినోత్సవం

★ సంఘటనలు

1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.

★ జననాలు

1879: పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, సంఘసంస్కర్త, నాస్తికవాది.
1906: వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మ.2003)
1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మ.2011)
1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త
1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు.
1986: ప్రియా ఆనంద్ , తమిళ, మలయాళ, హిందీ,కన్నడ,తెలుగు, చిత్రాల నటి .
1990 బండారు శివప్రసాద్ జర్నలిస్ట్, అధ్యాపకుడు, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు.

★ మరణాలు

1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888).