చరిత్రలో ఈరోజు ఆగస్టు 25

◆ దినోత్సవం

  • ఉరుగ్వే జాతీయ దినోత్సవం

◆ సంఘటనలు

1945: వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
1960: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
2003: బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది.
2007: హైదరాబాద్లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.

◆ జననాలు

1694: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
1724: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. (మ.1806)
1865: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (మ.1918)
1893: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
1917: దేవులపల్లి రామానుజరావు, రచయిత.
1926: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
1952: దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1955 : సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్
1961: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
1962: తస్లీమా నస్రీన్, బెంగాలీ రచయిత్రి.
1987: బ్లెక్ లైవ్లీ, అమెరికా టీ.వీ., సినిమా నటి.

◆ మరణాలు

1822: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. (జ.1738)
1867: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (జ.1791)
1908: హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1953: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
1960: చింతా దీక్షితులు, రచయిత. (జ.1891)
1969: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (జ.1908)
1999: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
2012: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
2015: పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.