TGLA లోకి కీలక నాయకురాలు

హైదరాబాద్ (ఆగస్టు – 27) : తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) తో కలిసి పని చేయడానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగన నాయకురాలు మరియు కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క ప్రతి ఉద్యమములో ముందు నడిపిన నాయకురాలు, తెలుగు అధ్యాపకురాలైన రజని గారు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార కుమార్ తెలిపారు.

TGLA సంఘ నిజాయితీ, నిబద్దత, పనితనం మెచ్చి ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్ తరాలకు అందించడం కోసం సంఘము తో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చినట్లుశ్రీమతి రజని గారు తెలిపినట్లు సంఘ నాయకులు తెలిపారు.

ఈ రోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫలవంతమైన ఫలితాలు పొంది ఈ రెగ్యులర్ కావడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదని. వారికి తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ స్వాగతపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార కుమార స్వామి, స్టేట్ బాడీ సభ్యులు గోవర్ధన్, ఉపేందర్ మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మబ్బు పరశురాం, హైదరాబాద్ జిల్లా బాధ్యులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.