సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్

  • తెలుగు, హిందీ, ఉర్దూతోపాటు పీడీల బదిలీ నిలిపివేత

హైదరాబాద్ (అక్టోబర్ – 03) :ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)ల బదిలీలకు బ్రేక్ ళపడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా అందులో సగం వరకు నిలిచిపోయాయి.

భాషా పండితులు, పీడీ పోస్టుల ఉన్నతీకరణ పదోన్నతులను ఎస్జీటీలను కలుపుకొని ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని ఇటీవల హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో బదిలీలు జరిగితే మారుమూల గ్రామాల్లో టీచర్లు ఉండరని కొందరు ప్రభుత్వంళదృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అధికారులు వాటిని నిలిపివేయాలని, మిగిలిన ఎస్ఏలకు సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు ఆదేశించారు.

బదిలీ అయిన వారంతా మంగళవారం కొత్త పాఠశాలల్లో చేరాలని స్పష్టం చేశారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని రిలీవ్ చేయవద్దని, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట వారిలో సీనియర్ ను బదిలీపై పంపి జూనియర్ ను అక్కడే కొనసాగించాలని సూచించారు.