Home > TELANGANA > డ్వాక్రా సంఘాలకు సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకై చేయూత – సీఎం రేవంత్ రెడ్డి

డ్వాక్రా సంఘాలకు సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకై చేయూత – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (MARCH 09) : విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో స్థానికంగా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని (Solar Plants by Dwacra groups) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడ్చెల్‌-మల్కాజిగిరి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలన‍్న ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు.

ఈ నెల12న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శక్తిని చాటుదామని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.