INDvsWI : టీట్వంటీ సిరీస్ విండీస్ దే

ప్లొరిడా (ఆగస్టు – 13) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టి20 లో విండీస్ 8 వికెట్లు తేడాతో గెలిచి సిరీస్ ను 3 – 2 తేడాతో గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నికోలస్ పూరన్, మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా షెపర్డ్ నిలిచారు.

వన్డే, టెస్టు సిరీస్ లు నెగ్గిన భారత్ టీట్వంటీ సిరీస్ లో బోల్తా పడింది. మొదటి రెండు టీట్వంటీ లు ఓడిన తర్వాతి రెండు మ్యాచ్ లు గెలిచిపప్పటికి కీలకమైన ఐదో టీట్వంటీ లో ఓటమితో సిరీస్ కోల్పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 165/9 పరుగులు సాధించింది. సూర్య కుమార్ యాదవ్ (61) రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. తిలక్ వర్మ 27 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ – 4, హోయిసిన్ – 2, హోల్డర్ – 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ మొదటి నుండి దూకుడు గా ఆడటంతో 18 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యం చేదించింది. బ్రెండన్ కింగ్ 85, పూరన్ 47 పరుగులు సాదించారు.