INDEPENDENCE DAY : 77వ స్వతంత్ర దినోత్సవం

BIKKI NEWS : భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. (independence day – 2023). 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలనకు చరమగీతం పాడిన రోజు ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15 భారతీయులందరికీ పండుగరోజు. 2023 ఆగస్టు 15 భారత్ కు 77వ స్వతంత్ర దినోత్సవం. రెండు ప్రపంచ యుద్దాలు జరుగుతున్న సమయంలో కూడా శాంతి, అహింసా పద్దతిలో గాంధీ మార్గంలో స్వతంత్రం సంపాదించడం భారత్ స్వతంత్ర ప్రత్యేకత.

◆ independence day 2023 theme

2023 ఆగస్టు 15న మనం జరుపుకునేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ గా ‘నేషన్ ఫస్ట్ – ఆల్వేస్ ఫస్ట్ (Nation First, Always First) అనే థీమ్ ని నిర్ణయించింది.

◆ శాంతిమార్గమే మంత్రం

దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ వలస పాలనలో భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో నష్టపోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగింది. వలస పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవ్వడం ప్రారంభించారు. తమకు సాధ్యమైన విధానాల్లో పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. ఆ తరువాత, మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా సత్యాహింసలు ఆయుధాలుగా పోరాటం సాగించింది.

◆ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్

స్వాతంత్ర దినోత్సవ చరిత్ర బ్రిటిష్ వలస పాలకులు భారత్ కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇచ్చారు. అయితే అంతకుముందే, జులై 4 1947న బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత జూలై 18 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ రూపొందింది. భారత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఆగస్టు 15 1947న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతంలో తొలిసారి రెడ్ ఫోర్ట్ లోని లాహోరీ గేటు వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు.