ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు

BIKKI NEWS (APRIL 12) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసుగా’ అంటూ వివిధ వార్తా పత్రికలూపత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికార వర్గాలు (employees 33 years service retirement news is fake) తెలిపాయి.

ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ కానీ లేదని స్పష్టం చేశాయి. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.