AP 12th PRC : 12వ పీఆర్సీ ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం

విజయవాడ (జూలై – 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్సీని (ap 12th PRC) నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ ను నియమించింది.

సంవత్సరం లోపల పీఆర్సీకి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొంది. వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానిక పరిస్థితులు, కరవు భత్యంపై అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సులు చేయాలని పేర్కొంది.

★ మరిన్ని వార్తలు