కాకినాడ (ఆగస్టు – 29) : ఆంధ్రప్రదేశ్ స సివిల్ సప్లైస్ కార్పొరేషన్ – కాకినాడలో 825 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్- 275
డేటాఎంట్రీ ఆపరేటర్-275
హెల్పర్-275.
అర్హతలు :
టెక్నికల్ అసిస్టెంట్ :- బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ బీఎస్సీ(బీజెడ్సీ)/బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ :- ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: అర్హత: 8, 10 వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్ కు 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ప్రత్యక్షంగా దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి
చిరునామా : డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 02 – 2023.