Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 05- 2025

BIKKI NEWS (MAY 06) : TODAY NEWS IN TELUGU on 6th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th MAY 2025

TELANGANA NEWS

ఉద్యోగ సంఘాల డిమాండ్లు తీర్చే స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భూమి స్వల్పంగా కంపించింది.

అంబర్‌పేట, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా జి. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు.

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె చేయొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం తెలిపారు.

మేడారం, భద్రాచలం, బాసరలను జాతీయ రహదారులకు కలుపుతామని గడ్కరి హామీ ఇచ్చారు.

ANDHRA PRADESH NEWS

ధాన్యం ఏ స్థితిలో ఉన్న కొనుగోలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.

సింహాచలంలో గోడను పునాది, డిజైన్ లేకుండానే కట్టారని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది

పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

కేతనకొండ లో సైనిక్ స్కూల్ మంజూరు. ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులను 120 రోజుల నుండి 180 రోజులకు పెంచుతూ… అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ సెలవులు వాడుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ లో వర్షాలు, పిడుగుల కారణంగా చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని బాబు తెలిపారు

NATIONAL NEWS

యుద్ధ సమయంలో ప్రజలు ఎదుర్కోవాల్సిన అంశాలపై మాక్ డ్రిల్స్ మే 7న నిర్వహించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన రాహుల్ గాంధీ సిబిఐ డైరెక్టర్ నియామకం పై చర్చ.

పుతిన్ కు ఫోన్ చేసి భారత్ కు ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోడీ

శబరిమల ఆలయాన్ని దర్శించునున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించనున్నారు

INTERNATIONAL NEWS

అన్ని పలు వస్తువుల దిగుమతిని నిలిపివేసిన భారత్ ప్రభుత్వం.

పాకిస్తాన్ లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

హిందువులను భారత్ కు పంపివేయాలని కెనడాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ర్యాలీ.

వరుసగా తన అమ్ముల పొడిలోని మిస్సైల్ ను పరీక్షిస్తున్న పాకిస్తాన్

SKYPE – స్కైపీ ని మూసివేస్తూ దాని స్థానంలో మైక్రోసాఫ్ట్ టీమ్స్ పేరుతో నూతన సేవలను అందుబాటులోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్

BUSINESS NEWS

STOCK MARKET – లాభాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు.

సెన్సెక్స్ 294 85, నిఫ్టీ 114.45 మా ఇంట్లో లాభంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు ముగిసాయి.

GOLD RATE – 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 220/- పెరిగి 95,730/- రూపాయలకు చేరింది.

USD vs INR – సోమవారం డాలర్ తో రూపాయి మారకం విలువ 84.23 రూపాయలకు చేరింది.

పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తల కారణంగా పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోతుందని మూడీస్ సంస్థ అంచనా వేసింది

SPORTS NEWS

IPL 2025 – హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

ఐపీఎల్ 2025 ప్లే ఆప్ కు చేరకుండానే ఎలిమినేట్ అయిన మూడో జట్టుగా హైదరాబాద్ నిలిచింది.

మాడ్రిడ్ ఓపెన్ ఏటిపి టెన్నిస్ టైటిల్ ను గెలుచుకున్న కాస్పర్ రూడ్

ఐసీసీ తాజా టీం ర్యాంకింగ్ లలో వన్డే, టీ20 లో మొదటి స్థానంలో, టెస్టుల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టు.

EDUCATION & JOBS UPDATES

MHSRB STAFF NURSE RESULTS. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు