Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 05- 2025

BIKKI NEWS (MAY 03) : TODAY NEWS IN TELUGU on 3rd MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd MAY 2025

TELANGANA NEWS

రాష్ట్రంలో ముంచెత్తిన వానతో అపార పంట నష్టం సంభవించింది.

కుల గణన అంశంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు

గ్రూప్ – 1 నియామకాలకు అనుమతి ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. విచారణను జూన్ 11 కు వాయిదా వేసింది

మే 5 నుంచి జూన్ 06 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటన

రాష్ట్రంలో 588 మండలాలపై వడగాల్పుల ప్రభావం ఉందని ప్రభుత్వం ప్రకటించింది

NDSA నివేదిక అధ్యయనానికి ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుండి 31 వరకు జరగనున్నాయి

28 మండలాల్లో భూభారతిని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు

ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించోద్దని పొంగులేటి స్పష్టం చేశారు

ANDHRA PRADESH NEWS

అమరావతి పునః ప్రారంభ సభలో ఏపీని దేశాభివృద్ధికి ఇంజన్ గా చేస్తామని మోడీ తెలిపారు.

మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని బాబు ప్రకటించారు

సింహాచలంలో కూలిన గోడ వర్షం ఉధృతికే కూలిందని దేవాదాయ శాఖ నివేదిక విడుదల చేసింది.

తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు చేపట్టింది

ఏపీ సిఐడి పరిధిని తేలుస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది

NATIONAL NEWS

గోవాలో ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు

నాతో శశితరూర్ వేదిక పంచుకోవడం కొందరికి నిద్ర పట్టకపోవచ్చు అంటూ మోడీ వ్యాఖ్య

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాల కారణంగా ఏడుగురు మృతి చెందారు.

ఉద్యోగికి పదోన్నతి అనేది హక్కు కాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది

దేశంలోని ఆయుధ కర్మాగారాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు

అధికారిక లెక్కల ప్రకారం గడువు ముగిసిన కూడా భారత్ లో మిగిలిపోయిన 70 మంది పాకిస్తాన్ పౌరులు

INTERNATIONAL NEWS

ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన అమెరికా

త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసుకొన్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు

పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తామని బంగ్లాదేశ్ కు తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ సలహాదారు ప్రకటించారు.

BUSINESS NEWS

సెన్సెక్స్ 260, నిఫ్టీ 13 పాయింట్లు లాభంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసింది.

భారత జిడిపి వృద్ధి రేటు 6.3 శాతమే అని స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) వెల్లడించింది

GOLD RATE – శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,080 పెరిగి 96,800కు చేరింది.

NSE WAVES – ఎన్ ఎస్ సి వేవ్స్ పేరుతో ఇండెక్స్ ను ప్రవేశపెట్టారు

SPORTS NEWS

IPL 2025 – గుజరాత్ చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం.

నేడు ఐపీఎల్ లో చెన్నై మరియు బెంగళూరు జట్లు తెలపడనున్నాయి

అంతర్జాతీయ చెస్ సమైక్య ర్యాంకింగ్ లలో కోనేరు హంపి ఐదో స్థానంలో నిలిచింది.

శ్రీశాంత్ పై మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం విధించింది

EDUCATION & JOBS UPDATES

DOST 2025 – డిగ్రీ అడ్మిషన్ల కొరకు దోస్త్ 2025 నోటిఫికేషన్

TG TET నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు ఎడిట్ అవకాశం

APPSC – నేటి నుండి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు ఆరంభం.

TGMS – తెలంగాణ మోడల్ స్కూల్ లలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు