Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 04 – 2025

BIKKI NEWS (APRIL 16) : TODAY NEWS IN TELUGU on 16th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 16th APRIL 2025

TELANGANA NEWS

భూభారతి చట్టం ద్వారా విచారణ తర్వాతే వారసత్వ బదిలీ చేపట్టనున్నారు.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం

పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ గ్రూప్ – 1 మార్కులపై ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇండియా జస్టిస్‌ రిపోర్టు-2025లో తెలంగాణ పోలీసులు ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు.

వడదెబ్బ మృతులకు రూ.4లక్షలు పరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

ఎమ్మెల్యేలు గీత దాటితే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పీ సమావేశంలో పేర్కొన్నారు.

నేటి నుండి సింగరేణి నైని గనులలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు

ANDHRA PRADESH NEWS

మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ఏపీలో ఎస్సీ వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీ చేయాలని చంద్రబాబు నిర్ణయం

అమరావతి గుంటూరు విజయవాడ ను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపా

వారం రోజుల్లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు

తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదయింది

NATIONAL NEWS

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025 పై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారించనుంది.

సుప్రీంకోర్టు జడ్జి దినేశ్‌ మహేశ్వరి 23వ లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కేంద్రం నియమించింది.

దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు

అమర్‌నాథ్‌ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై ఈడీ చార్జీషీట్ దాఖలు.

ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.

శిశువుల అక్రమ రవాణా జరిగితే లైసెన్స్‌ను రద్దు చేయండి : సుప్రీంకోర్టు ఆదేశం

INTERNATIONAL NEWS

ఆఫ్ఘనిస్తాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం.

ఉత్తర చైనాలో కార్చిచ్చు అలముకుంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

చైనా విమానయాన సంస్థలు అమెరికా కు చెందిన బోయింగ్ విమానాలను కొనుగోలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నాసాలో ప‌నిచేస్తున్న భార‌తీయ సంత‌తి మ‌హిళా చీఫ్ నీలా రాజేంద్ర ను ట్రంప్ తొలగించారు.

BUSINESS NEWS

STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 76,734.89 (1,577.63)
నిఫ్టీ : 23,328.55 (500)

2025 చివరి నాటికి తులం బంగారం ధర 1,25,000/- లకు చేరోచ్చని గోల్డ్ మాన్ సాచ్స్ సంస్థ అంచనా వేసింది.

SPORTS NEWS

IPL 2025 – లో స్కోరింగ్ మ్యాచ్ లో కోల్‌కతా పై పంజాబ్ సంచలన విజయం.

ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ – మార్చి 2025 గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.

ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ – మార్చి 2025 గా ఆస్ట్రేలియా కు చెందిన జార్జీయా వాల్ నిలిచింది.

వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రోహిత్‌శర్మ, అజిత్‌ వాడేకర్‌, శరద్‌పవార్‌ పేర్లు పెట్టారు

ఆగస్టులో భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

EDUCATION & JOBS UPDATES

TGS RTC JOBS – త్వరలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్

LAWCET 2025 – దరఖాస్తు గడువు ఎప్రిల్ 30 వరకు పెంపు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు