BIKKI NEWS (APRIL 10) : TODAY NEWS IN TELUGU on 10th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th APRIL 2025
TELANGANA NEWS
TGPSC – తెలంగాణ గ్రూప్ కు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది.
తెలంగాణలో రాగల రెండు మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ బైటాయింపు.
ఐఏఎస్ రోనాల్డ్ రాస్ ను తెలంగాణ కి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి పంపిన బిల్లులపై కేంద్రం చర్యలు తీసుకోవట్లేదని రాహుల్ గాంధీ విమర్శించారు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులపై ప్రత్యేకంగా సమావేశమైన సిట్.
ANDHRA PRADESH NEWS
హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హై వే కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.
తిరుపతి – పాకాల.- కాట్పాడీ లైన్ లో డబ్లింగ్ పనులకు కేంద్రం ఓకే
వెంకటగిరిమున్సిపాలిటీ లో టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. పట్టునిలుపుకున్న వైసీపీ
NATIONAL NEWS
మే 9న రష్యా నిర్వహించే విక్టరీ డే పరెడ్ కు హజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఆహ్వానం.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబడదు అని ముఖ్యమంత్రి మమత తేల్చిచెప్పారు.
రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశంతో మెగా డీల్ కుదుర్చుకుంది.
ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ అమలు చేయడానికి ముహూర్తం ఫిక్స్. ప్రస్తుతం 26 రాష్ట్రాలో 43 ఆర్ఆర్బీలు ఉండగా.. ఈ సంఖ్య 28 తగ్గుతుంది.
రాజ్యాంగంలోని 200 అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై మూడు నెలల్లోగా తేల్చాల్సిందే.. గవర్నర్లు చట్టానికి అతీతులు ఏమీ కాదంటూ సుప్రీం వ్యాఖ్యలు.
బీహార్ లో పిడుగులు కారణంగా 13 మంది మృత్యువాత పడ్డారు.
2040 నాటికి చంద్రునిపై భారత వ్యోమగామిని చూస్తామని అలాగే 2036 నాటికి భారత్ తన సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు
INTERNATIONAL NEWS
TRUMP – త్వరలోనే ఫార్మా ఉత్పత్తులపై టారీఫ్ లు
Panama Canal – త్వరలోనే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం – పెంటగాన్.
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలో నైట్క్లబ్లో పైకప్పు కూలిన ఘటనలో 79 మంది మృతిచెందగా, మరో 160 మంది గాయపడ్డారు.
TRADE WAR – అమెరికా చైనా ఉత్పత్తుల పై 104 శాతం సుంకం విధించగా.. అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నామని చైనా తాజాగా ప్రకటించింది.
దిగ్గజ కంపెనీలు ప్రపంచంలోని తమ కంపెనీ లను అమెరికాకు తరలించాలని ట్రంప్ ప్రతిపాదించారు.
BUSINESS NEWS
STOCK MARKET – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.
సెన్సెక్స్ : 73847.15 (-379.33)
నిఫ్టీ :22,399.15 (-136.70)
RBI – ఆర్బీఐ తన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం లో రెపో రేటు ను 25 బేసీస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి చేరింది.
ఆర్బీఐ ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు ను 6.5% గా, ద్రవ్యోల్బణం ను 4% అంచనా వేసింది.
యూపీఒ ద్వారా మర్చంట్ లావాదేవీల పరిమితిని బ్యాంకులు పెంచుకోవడానికి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది.
SPORTS NEWS
IPL 2025 – రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
EDUCATION & JOBS UPDATES
TGCET 2025 మొదటి విడత సీట్లు కేటాయింపు జాబితా విడుదల
TGTWCOE CET 2025 ఫలితాలు విడుదల.
కోర్టు ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు.
TGPSC – గ్రూప్ – 1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది.
- Degree admissions 2025 – బీసీ డిగ్రీ గురుకులాల్లో అడ్మిషన్లు
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
- STOCK MARKET – లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు
- తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగించిన తెలుగు అధ్యాపకులు
- GOLD RATE – పెరిగిన బంగారం, వెండి, ప్లాటినం ధరలు