Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 04 – 2025

BIKKI NEWS (APRIL 27) : TODAY NEWS IN TELUGU on 27th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU 27th 2025

TELANGANA NEWS

నేడు వరంగల్ లో బీఆర్ఎస్ రజితోత్సవ సభ.

ముగిసిన భారత్ సమ్మిట్ సదస్సు. తెలంగాణ ఆకాంక్షలను ప్రపంచానికి చాటండి అని సీఎం రేవంత్ పిలుపు

కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ అరెస్ట్

ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల నియామక పరీక్షను తెలుగులోను నిర్వహించాలని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కు హైకోర్టు ఆదేశం.

హయత్ నగర్ లో అగ్నిప్రమాదం 300 గుడిసెలు దగ్ధం

తెలంగాణ రాష్ట్రంలో 230 మంది పాక్ పౌరులకు ఉన్నట్లు డీజీపీ వెల్లడి

ANDHRA PRADESH NEWS

ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై రేపు విచారించనున్న ఏపీ హైకోర్టు

ఎస్సీ, ఎస్టీ, బిసి, దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులతోని డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.

మత్స్యకార సేవ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

NATIONAL NEWS

నియంత్రణ రేఖ వెంబడి అర్ధరాత్రి కాల్పులు జరిపిన పాకిస్తాన్ ఆర్మీ

ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్ లో వ్యాఖ్యానించారు

మానస్ సరోవర్ యాత్రకు జూన్ నుండి ఆన్లైన్ దరఖాస్తులు

భారత విమానాలకు గగనతరాన్ని మూసివేసిన పాకిస్తాన్

కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భారత సైన్యం

గత పదేళ్లలో కడు పేదరికం నుండి 17.1 కోట్ల మంది భారతీయులు బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది

INTERNATIONAL NEWS

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రపంచ దేశాధినేతలు, రాజ కుటుంబాలు

భారత్ పాకిస్తాన్ లది 1000 సంవత్సరాల పోరు అంటూ ట్రంప్ వ్యాఖ్య

సింధు నీళ్లు ఆపితే రక్తం పారుతుండని బిలావల్ భుట్టో వ్యాఖ్యలు

ఇరాన్ పోర్టులో భారీ పేలుడు ఐదుగురు మృతి

విద్యార్థుల వీసాల రద్దు ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ట్రంప్ సర్కార్

BUSINESS NEWS

రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనంత్ అంబానీ నియామకం

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లో మహిళ ఉద్యోగ రేటు 31 శాతం

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లో నిరుద్యోగ రేటు 13.3%

SPORTS NEWS

పంజాబ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు. చెరో పాయింట్ కేటాయింపు.

ఐపీఎల్ లో నేడు ముంబై మరియు లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే ఢిల్లీ బెంగళూరు జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

నేటి నుండి భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరగనుంది.

EDUCATION & JOBS UPDATES

ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిన కాలేజీలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు