చరిత్రలో ఈరోజు అక్టోబర్ – 07

★ సంఘటనలు

1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.

★ జననాలు

1885: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)
1900: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీ సభ్యుడు. (మ.1945)
1901: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు. (మ.2011)
1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

★ మరణాలు

1940: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
1975: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887)
1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
2007: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)