చరిత్రలో ఈరోజు మే – 22

దినోత్సవం

  • అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

సంఘటనలు

0334 : బి.సి. అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్ III ని, టర్కీ లోని గ్రేనికస్ అనే చోట ఓడించాడు.
0337 : కాన్ స్టాంటిన్ ది గ్రేట్ మరణించాడు. ఇతడు, తన రాజ్యంలో, క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేసాడు.
1216: ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలు పెట్టాయి.
1455: 30 సంవత్సరాల వార్స్ ఆఫ్ రోజెస్ యుద్ధం మొదలైన రోజు.
1570: మొట్టమొదటి ఆధునిక అట్లాస్, 70 పటాలు (మేప్స్ ) తో అబ్రహం ఓర్టెలియస్ , అనే, ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ (పటాల రూపకర్త) బెల్జియంలో ప్రచురించాడు.
1761: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదటి జీవిత బీమా పాలసీని, ఫిలడెల్ఫియా లో, జారీ చేసారు.
1841: ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ ( వంగిన భాగాలతో తయారు చేసింది. పడక కుర్చీ, (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
1849: అబ్రహం లింకన్, తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్ ) ‌ కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది
2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
2010: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.

జననాలు

1783: విలియం స్టర్జియన్ , మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
1822: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
1828: ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె, ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
1859: సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
1944: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
1955: పి. చంద్రశేఖర అజాద్, కథా రచయిత, నవలారచయిత.
1957: సీమ ,: దక్షిణ భారత చలన చిత్రాలతో పాటుహిందీ చిత్రాల నటి.(మళయాళ దర్శకుడుఐ.వి.శశి భార్య)

మరణాలు

1885: విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)
1960: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
2002: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
2010: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
2015: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
2019: చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు. (జ.1940)
2023: కేతు విశ్వనాథరెడ్డి, తెలుగు రచయిత (జ. 1939)
2023: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (జ. 1951)