చరిత్రలో ఈరోజు మే 19

సంఘటనలు

1971: ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)
1927: సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.
1944: అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.
1990: మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.
1991: సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.

జననాలు

1890: హొ చి మిన్, అమెరికాను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు. ఇతని మరణానంతరం, వియత్నాం రాజధాని పేరును హో చి మిన్ సిటీగా మార్చారు.
1894: గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979)
1908: మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956)
1908: జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.
1910: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
1913: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి.
1915: మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.
1934: పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.
1938: గిరీష్ కర్ణాడ్ , కన్నడనటుడు , రచయిత, దర్శకుడు , జ్ఞానపీఠ అవార్డుగ్రహీత (మ.2019)
1941: పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 2007)
1946: చెర్, అమెరికన్ నటి.
1990: సిద్ శ్రీరామ్ , పాటల రచయిత.

మరణాలు

1970: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894)
1952: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)
1985: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)
2008: విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928)