చరిత్రలో ఈరోజు ఆగస్టు 28

◆ సంఘటనలు

1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.

◆ జననాలు

1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
1904: దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004)
1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
1949: డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి.
1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ శాండ్‌బర్గ్
1976: కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు (మ. 2023)
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్

◆ మరణాలు

1958: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
1988: చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (జ.1910)
2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.