చరిత్రలో ఈరోజు ఆగస్టు 12

◆ దినోత్సవం

  • ప్రపంచ ఏనుగుల దినోత్సవం
  • అంతర్జాతీయ యువ దినోత్సవం
  • జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)

◆ సంఘటనలు

1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.
1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. – అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో స్థాపించబడింది.
1976: లండన్ లోని నేషనల్ థియేటర్ ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
1978: ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
2010: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది
2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.

◆ జననాలు

1892: ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది.
1892: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
1930: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.
1939: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)
1965: పల్లెర్ల రామ్మోహనరావు, కళాకారుడు, భజన కీర్తనల రచయిత.

◆ మరణాలు

30 బి.సి: క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి
1944: కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).
1945: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).
2009: మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927).
2022: అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్‌. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963)