UJJI NEWS (MAY 17) : Thalliki vandanam scheme from june 2025. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని జూన్ మాసంలో అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Thalliki vandanam scheme from june 2025
బడికి వెళ్లే పిల్లలందరికీ సంవత్సరానికి 15వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకంలో అందజేయనున్నారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ మాసంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని తాజాగా పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం.
Free bus in AP – ఉచిత బస్ పథకం అమలు తేదీ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Free bus in AP from August 15th.
ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
దీని ప్రకారం ఇప్పటికే మార్గదర్శకాలు కొరకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్