Group 4 – నేటి నుంచి ధ్రువ పత్రాల పరిశీలన

BIKKI NEWS (JUNE 20) : TGPSC GROUP 4 CERTIFICATE VERIFICATION STARTS TIDAY ONWARDS. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తి మెరిట్‌ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈరోజు (జూన్ 20) నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.

దాదాపు రెండు నెలల పాటు అనగా ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ ఉదయం, మధాహ్నం వేళల్లోఈ ప్రక్రియ కొనసాగనుంది.

నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌ గార్డెన్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన జరుగుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో గైర్హాజరైన అభ్యర్థులు, ఏదైనా ధ్రువీకరణ పత్రం  ఇవ్వనివారు.. వాటిని సమర్పించేందుకు ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వుడేగా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.

అలాగే గ్రూప్‌-2 దరఖాస్తుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించుకునేందుకు ఇచ్చిన ఎడిట్‌ ఆప్షన్‌ గడువు జూన్ 20తో ముగియనుందని తెలిపింది.

JOB NOTIFICATIONS

TELEGRAM