Home > EDUCATION > EAPCET > TG EAPCET 2025 – నేటి నుండి పరీక్షలు, కీలక నిబంధనలు ఇవే…

TG EAPCET 2025 – నేటి నుండి పరీక్షలు, కీలక నిబంధనలు ఇవే…

BIKKI NEWS (APR. 29) : TG EAPCET 2025 EXAMS GUIDELINES. తెలంగాణ రాష్ట్ర ఎప్‌సెట్‌ 2025 పరీక్షలు నేటి నుండి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు జరగనున్నాయి.

TG EAPCET 2025 EXAMS GUIDELINES.

అగ్రికల్చర్‌-ఫార్మసీకి 87 వేల మంది, ఇంజినీరింగ్‌కు 2.20 లక్షల మంది దరఖాస్తు చేశారు.

విద్యార్థులకు ఈ పరీక్షలకు సంబంధించి కీలక నిబంధనలు విడుదల చేశారు.

  • పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి.డీన్‌కుమార్, కో-కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
  • ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.
  • ఉదయం పరీక్షకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.
  • సాంకేతిక కారణాల వల్ల కంప్యూటర్‌ ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన సమయాన్ని కంప్యూటర్‌ ఆన్‌ అయిన తర్వాత కేటాయిస్తారని తెలిపారు.
  • విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని రావద్దని స్పష్టం చేశారు
  • పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో నిర్వహించనున్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు