Home > UNCATEGORY > జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో టీచర్స్ డే వేడుకలు

జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో టీచర్స్ డే వేడుకలు

BIKKI NEWS (SEP. 05) : Teachers Day Celebrations in GJC Girls Husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

Teachers Day Celebrations in GJC Girls Husnabad

ఈ కార్యక్రమాన్ని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి రవీందర్ గారు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నమస్కరించి ప్రారంభించారు.

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఎంతో కష్టపడి రాష్ట్రపతి పదవి వరకు వెళ్లడానికి గుర్తు చేస్తూ.. విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురించి ఉపన్యాసించడం జరిగింది.

ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం యస్. సదానందం, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, టి. నిర్మల దేవి, ఎస్. కవిత, జి. కవిత, పి. రాజేంద్రప్రసాద్ మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు