RYTHU BHEEMA – రైతు భీమా దరఖాస్తు గడువు ఆగస్టు 05

BIKKI NEWS (JULY 22) : RYTHU BHEEMA APPLICATION 2024. రైతు బీమా పథకం కొరకు రైతుల నుండి దరఖాస్తుల కోరుతూ వ్యవసాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. 18 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన రైతులు ఆగస్టు 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

RYTHU BHEEMA APPLICATION 2024

ఇప్పటివరకు రైతు బీమా పథకం కొరకు దరఖాస్తు చేసుకొని నూతన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. అలాగే జులై 28 వరకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చే రైతులు కూడా ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

అర్హత కలిగిన రైతులు ఏఈవో కు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తు ఫారం తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు నామీని యొక్క ఆధార్ కార్డులను జత చేయాల్సి ఉంటుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు