Farmer Loan – రైతు రుణమాఫీ పై సీఎం సమీక్ష సమావేశం

BIKKI NEWS (JUNE 10) : పంట రుణమాఫీతో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం (review meeting on farmer loan waiver by cm revanth reddy) నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీని ఒకేసారి చేయడానికి గల మార్గాలను అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు.

అలాగే ఖరీఫ్ సాగుకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించినారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.