Home > EDUCATION > INTERMEDIATE > ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

BIKKI NEWS (JUNE 26) : Providing Quality education in GJCs. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యా నాణ్యతను మెరుగుపరిచే దిశగా మేధోమథనం జరిపేందుకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు, ప్రిన్సిపాల్ లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యా మండలిలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, IAS గారు, మరియు ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు మరియు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య, IAS గారు అధ్యక్షత వహించారు.

Providing Quality education in GJCs.

సమావేశంలో మాట్లాడుతూ డా. యోగిత రాణా గారు నాణ్యమైన విద్యే సమాజ రూపాంతరం మరియు విద్యార్థుల భవిష్యత్తుకు ఆధారం అని తెలిపారు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి అవసరమైన నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మద్దతు లభించేలా, ప్రిన్సిపాళ్లు మరియు DIEO లు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.

ఈ విద్యా సంవత్సరంలో సుమారు 75,000 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశం పొందరని, కళాశాలలో చేసిన ప్రతి అడ్మిషన్ UDISE డేటాలో ఖచ్చితంగా నమోదు చేయాలి. విద్యార్థుల ప్రవేశాలు పెంపొందించడం, ప్రవేశం పొందిన వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని, అకడమిక్ కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వం పెంపొందించేవిధంగా ఉంచాలని ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు అన్నారు. ఇందుకోసం DIEO లు ప్రిన్సిపాల్ లతో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.

ప్రతి కళాశాలలో Parent-Teacher Meetings (PTMs) ను త్వరలో నిర్వహించాలి. ఫిజిక్స్ వాలా మరియు ఖాన్ అకాడమీ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా JEE, NEET, CLAT, మరియు EAPCET కు ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించబడుతుంది. గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు రవాణా మరియు హాస్టల్ సదుపాయాలు TSRTC మరియు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసి కల్పించడం జరుగుతుందన్నారు.

కళాశాలలలో విద్యార్ధులలో హాజరు శాతం పెరిగేలా అకడమిక్ కార్యక్రమాలు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులను నాయకత్వ లక్షణాల పెంపుదల, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సహించాలి. సంక్షేమ శాఖల ద్వారా స్కాలర్షిప్ ల కోసం నమోదు సమయానికి పూర్తిచేయాలి. HELP, హార్ట్ ఫుల్ నెస్. ప్రజ్వలా సంస్థల ద్వారా ధ్యానం, మంచి జీవనశైలి, లైంగిక దాడుల నివారణ మరియు జాగ్రత్తలు, మాదక ద్రవ్యాలను నిరోదించడం మరియు లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, బాధ్యతాయుత జీవనశైలి కోసం అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో శ్రీమతి జయప్రద బాయి, COE గారు మరియు TGBIE కి చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు