ANGANWADI : అంగన్వాడీ ఉద్యోగులకు పీఆర్సీ

హైదరాబాద్ (అక్టోబర్ – 01) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను వచ్చే పీఆర్సీ లో చేరుస్తూ వారికి కూడా పీఆర్సీ అమలు చేస్తామని (PRC IMPLEMENTATION TO ANGANWADI EMPLOYEES IN TELANGANA) ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

అలాగే ఇటీవలే మినీ అంగన్వాడీ లను అంగన్వాడీ లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అంగన్వాడీ లకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను కూడా చెల్లింపు చేశామని తెలిపారు.