BIKKI NEWS (MAY 21) : National Anti Terrorism day may 21st. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి (Rajiv Gandhi Vardhanthi) రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపబడుతుంది.
National Anti Terrorism day may 21st
1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. ఆయన చనిపోయిన నాటినుండి విపి సింగ్ ప్రభుత్వం హయాంలో మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది. శాంతి, సామరస్యం, మానవజాతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు.
తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దశ్యం.
తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్