LUNA 25 జాబిల్లికి చేరువలో…

హైదరాబాద్ (ఆగస్టు – 20) : చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన LUNA 25 ల్యాండర్ లో ఇబ్బందులు తలెత్తాయి. సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్ కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్) కు చేరడానికి శనివారం లూనా – 25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్కస్మోస్ తెలిపింది.

ఈ నేపథ్యంలో దాని ల్యాండింగ్ వాయిదా పడుతుందా అన్నదానిపై ఆ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈరోజు సమస్యను పరిష్కరించినట్లు లూనా 25 తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామ కు సంబం ధించిన ఫొటోలను అందించింది.

లూనా-25ని ఈ నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్
నుంచి నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై ల్యాండింగు రష్యా ప్రయత్నిస్తోంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3.. ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనుంది. లూనా-25 కూడా అదే ప్రాంతంలోని బొగుస్లావ్స్కీ బిలానికి చేరువలో 1-2 రోజుల ముందు దిగాల్సి ఉంది.