Home > NATIONAL > CENSUS 2027 – జనాభా లెక్కలు 2027 పూర్తి వివరాలు

CENSUS 2027 – జనాభా లెక్కలు 2027 పూర్తి వివరాలు

BIKKI NEWS (JUNE 08) : INDIA POPULATION CENSUS 2027. భారత జనాభా లెక్కలు 2027 లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. 16 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు చేపట్టనుంది. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు చేపట్టారు.

INDIA POPULATION CENSUS 2027

2026 ఏప్రిల్ – 01న జనాభా లెక్కలు ప్రారంభం కానున్నాయి.

ఫిబ్రవరి 28 – 2027లో జనాభా లెక్కలు పూర్తికానున్నాయి.

మార్చి – 01 – 2027 ను జనాభా లెక్కలకు ఆధార తేదీగా ప్రకటించారు.

ఈ జనాభా లెక్కల ప్రత్యేకత పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టమన్నారు.

స్వాతంత్ర అనంతరం జనాభా లెక్కల తో పాటు కుల గణన కూడా చేపట్టనున్న జనాభా లెక్కలు ఇవే.

లడఖ్ మరియు హిమాలయాలలో కొన్ని ప్రదేశాలలో జనాభా లెక్కలకు ఆధారిత తేదీగా అక్టోబర్ 1 – 2026 ను ప్రకటించారు.

జనాభా లెక్కలను సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం మరియు సెన్సస్ రూల్స్ 1990 ప్రకారం చేపడుతారు.

ఈ జనాభా లెక్కలు షెడ్యూలు ప్రకారమైతే 2021లో చేపట్టాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఈ జనాభా లెక్కలు వాయిదా పడుతూ వచ్చాయి.

లోక్‌సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఈ జనాభా లెక్కల అనంతరం చేపట్టనున్నారు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 81 మరియు 82 ల ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ మరియు శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గాల పునరు విభజన చేపట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఉన్నాయి.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కూడా ఈ జనాభా లెక్కల అనంతరం వీటి ఆధారంగానే చేపట్టనున్నారు.

ఈ జనాభా లెక్కలు 2029 సాధారణ ఎన్నికల ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు