BIKKI NEWS (JUNE 07) : తెలంగాణ రాష్ట్ర గురుకుల పోస్టుల భర్తీలో భాగంగా మైనార్టీ గురుకుల సొసైటీలో పీడీ, లైబ్రేరియన్ పోస్టుల కేటాయిస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) నిర్ణయం (GURUKULA JOBS POSTINGS 2024) తీసుకుంది.
ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు నిర్దేశిత సర్టిఫికెట్లతో నాంపల్లిలోని అనిసుల్గుర్బాలో ఉన్న సొసైటీ కార్యాలయానికి 11,12 తేదీల్లో రావాలని పోస్ట్ ద్వారా కాల్లెటర్లనమ పంపడం జరిగింది.
9,210 గురుకుల పోస్టులకు ట్రిబ్ నియామక ప్రక్రియను చేపట్టింది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన మెరిట్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, సొసైటీల వారీగా అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ఇచ్చింది. ఆయా సొసైటీలు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి పోస్టింగ్ను ఇవ్వాల్సి ఉన్నది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొసైటీలు ఆ ప్రక్రియను ఇప్పటివరకు చేపట్టలేదు.