BIKKI NEWS (AUG. 23) : DEEN DHAYAL SPARSH YOJAN SCHOLARSHIP. భారత ప్రభుత్వం దీన్దయాల్ స్పర్శ్ యోజన పథకం కింద తపాలా బిళ్ళలు సేకరించే 6, 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన విడుదల చేశారు.
ఎంపిక అయినా అభ్యర్థులకు నెలకు 500/- రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేయనున్నారు.
అర్హతగా గత విద్యా సంవత్సరంలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. మరియు తపాలా బిళ్ళలు సేకరణ హబీగా ఉండాలి.
దరఖాస్తు కొరకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను గాని లేదా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా గాని చేసుకోవచ్చు.
వెబ్సైట్ : www.indiapost.gov.in