Dasarathi Award 2022: వేణు సంకోజు కు అవార్డు

హైదరాబాద్ (జూలై – 20) : నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యకు గుర్తింపుగా ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను గుర్తించి ప్రతి ఏడాది ప్రకటించే ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను (dasarathi-krishnamacharya-award-venu-sankoju) 2022 సంవత్సరానికి గాను ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 లో కాళోజీ సాహితీ పురష్కారం కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అవార్డు కింద రూ. 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూటా పదహార్లు) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఈ సందర్భంగా జరిగే సత్కార కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తారు.