CRICKET – యంగ్ ఇండియాదే సిరీస్

రాయ్‌పూర్ (డిసెంబర్ – 01) : ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న (Cricket match india vs australia) 4వ టి20 మ్యాచ్ లో భారత జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాదించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 154/7పరుగులకే భారత్ బౌలర్లు కట్టడి చేశారు భారత బౌలర్లలో అక్షర్ నటేల్ – 3, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. రింకు సింగ్ 46, యశస్వి జైస్వాల్ 37, రుతురాజు గైక్వాడ్ 32, జితేష్ శర్మ 35 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వారయిస్ – 3, బెండ్రాఫ్ – 2, తన్వీర్ సంగా – 2 వికెట్లు తీశారు.