BIKKI NEWS (APR. 12) : BHU BHARATI PILOT PROJECT IN 3 MANDALS. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు రూపొందిన భూ భారతి పోర్టల్ను ఏప్రిల్ 14, సోమవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు.
BHU BHARATI PILOT PROJECT IN 3 MANDALS
భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన భూభారతి పోర్టల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.
“భూ భారతి పైలట్ ప్రాజెక్ట్గా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి, వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సుల ద్వారా భూ భారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయాలి.
పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలి.
భూ భారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలి. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
సాంకేతికంగా బలమైన వెబ్సైట్, మొబైల్ యాప్లతో భూ భారతి పోర్టల్ను నిర్వహించాలి.
భూ భారతి పోర్టల్ ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు, వారి భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం మెరుగుపరచాలి” అని ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు