BIKKI NEWS (JUNE 22) : Bhu bharathi revenue sadassulu. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి భూ సమస్యలపై 8.58 లక్షల దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Bhu bharathi revenue sadassulu
మూడు విడతలలో నిర్వహించిన రెవిన్యూ సదస్సుల లో ప్రజల నుండి ఉచితంగా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా నుండి 67 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు.
పేద రైతుల కష్టాలను తీర్చడమే ధ్యేయంగా ఆర్ఓఆర్ చట్టం 2020ని తిరగరాసి, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపునున్నట్లు తెలిపారు.
సాదా బైనామాలు మినహా ఈ దరఖాస్తుల్లో 60% పైగా సమస్యలకు పరిష్కారం చూపమని తెలిపారు.
ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేశామని… మిగిలిన వాటిని కూడా వేగంగా ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం చూపుతామని తెలిపారు.
Land Issues Clear Upto 15th Augustus
భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం రెవిన్యూ యంత్రాంగం నిరంతరం చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆగస్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని ఇందుకు అధికారులు సహకరించాలని దిశానిర్దేశం చేశారు.