BIKKI NEWS : భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 1954 జనవరి 2న ఏర్పాటు చేశారు. గతంలో ఈ పురస్కారాన్ని కళలు, సాహిత్యం, శాస్త్ర, ప్రజాసేవా రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి అందజేసేవారు. BHARAT RATNA AWARD WINNERS LIST
కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్లో ఏ రంగంలోనైనా అసమాన సేవలు అందించినవారికి, అద్వితీయ ప్రతిభావంతులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది.
ఒక సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని ముగ్గురు వ్యక్తులకు మించి ఇవ్వకూడదు. ఇప్పటి వరకూ ఈ అవార్డును 50 మందికి ప్రదానం చేశారు. గ్రహీతలు ఈ అవార్డును వారి పేరుకు ముందుగానీ, వెనుకగానీ ఉపయోగించకూడదు.
భారత ప్రభుత్వం లాల్ కృష్ణ అద్వానీ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించింది.
లాల్ కృష్ణ అద్వానీ భారతదేశానికి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా సేవలు అందించారు. అలాగే బిజెపి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. రథయాత్రతో భారతదేశం అంతా యాత్ర చేసి బిజెపి పార్టీని దేశం నలుమూలల వ్యాపింప చేశాడు. అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం తీవ్ర కృషి చేశాడు.
BHARAT RATNA AWARD WINNERS LIST
మొదటిసారిగా భారతరత్న అందుకున్న ముగ్గురు వ్యక్తులు
సి. రాజగోపాలాచారి,
సర్వేపల్లి రాధాకృష్ణన్,
సి.వి. రామన్. వీరికి 1954లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
1966లో మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్బహదూర్ శాస్త్రి. ఇప్పటి వరకు 13 మందికి మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరా గాంధీ. ఈమెకు 1971లో దీన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు ఐదుగురు మహిళలకు ఈ పురస్కారం లభించింది.
ఈ అవార్డును ఇద్దరు విదేశీయులకు కూడా ప్రదానం చేశారు.
1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్తాన్),
1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న అందజేశారు.
భారతరత్నతో పాటు నోబెల్ బహుమతిని అందుకున్నవారు సి.వి. రామన్, మదర్ థెరిసా, అమర్త్యసేన్.
2013లో భారతరత్నను ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ప్రకటించారు. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్. అంతేకాకుండా 40 ఏళ్ల వయసులో భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని పొందిన పిన్న వయస్కుడు కూడా సచినే కావడం గమనార్హం.
BHARATH RATHNA Karpoori Thakur – కర్పూరి ఠాకూర్ కు భారతరత్న
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం బీహార్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అయిన కర్పూరి ఠాకూర్ కు (BHARATH RATHNA Karpoori Thakur ) మరణానంతరం ప్రకటించింది.
కర్పూరి ఠాకూర్ (24 జనవరి 1924 – 17 ఫిబ్రవరి 1988) బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు . అతను జన్ నాయక్ (ప్రజల హీరోకి హిందీ) అని ప్రసిద్ధి చెందాడు . అతను డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 ( సోషలిస్ట్ పార్టీ / భారతీయ క్రాంతి దళ్ ) వరకు మరియు డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 ( జనతా పార్టీ ) వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు .. జనవరి 23, 2024న భారత ప్రభుత్వంచే భారతరత్న (మరణానంతరము) ప్రదానం చేయబడింది.
2014 డిసెంబర్ 24న పండిట్ మదన్మోహన్ మాలవ్య (మరణానంతరం), భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ప్రకటించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది.
భారతరత్న పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికేట్, రాగి ఆకు ప్రతిమను బహూకరిస్తారు. నగదు బహుమతి ఉండదు.
1977 జూలైలో జనతా ప్రభుత్వం ఈ అవార్డును రద్దు చేసింది.వ1980లో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది.
భారతరత్న అవార్డు గ్రహీతలు
1) సి. రాజగోపాలాచారి – 1954
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ చివరి గవర్నర్ జనరల్.
2) సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1954
ప్రముఖ విద్యావేత్త, భారత తొలి ఉప రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు (1952-62). ఆ తర్వాత 1962 నుంచి 1967 వరకు భారత రెండో రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు.
3) సి.వి. రామన్ – 1954
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
4) భగవాన్ దాస్ – 1955
స్వాతంత్య్ర సమరయోధుడు. 1921లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విద్యా పీఠ్ను స్థాపించారు. ఈ సంస్థనే 1995లో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్గా పేరుమార్చారు.
5) మోక్షగుండం విశ్వేశ్వరయ్య – 1955
విఖ్యాత సివిల్ ఇంజనీర్
6) జవహర్లాల్ నెహ్రూ – 1955
1947 నుంచి 1964 వరకు తొలి భారత ప్రధానిగా పనిచేశారు.
7) గోవింద్ వల్లభ్ పంత్ – 1957
స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి (1950-54)గా పనిచేశారు.
8) థొండో కేశవ్ కర్వే – 1958
ప్రముఖ సంఘ సంస్కర్త. మహర్షి కర్వేగా విఖ్యాతి చెందారు. మహిళల అభివృద్ధికి పాటుపడ్డారు. 1958లో తన నూరో ఏట భారతరత్న అందుకున్నారు. 1962లో మరణించారు.
9) బిధాన్ చంద్ర రాయ్ – 1961
ప్రముఖ వైద్యుడు. ఆయన పుట్టినరోజైన జూలై 1వ తేదీని ‘డాక్టర్స్ డే’గా పాటిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి.
10) పురుషోత్తమ్ దాస్ టండన్ – 1961
స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, హిందీభాషకు అధికారిక హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు.
11) బాబూ రాజేంద్రప్రసాద్ – 1962
స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, భారత తొలి రాష్ట్రపతి. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి.
12) జాకీర్ హుస్సేన్ – 1963
రెండో ఉప రాష్ట్రపతి (1962-67), మూడో రాష్ట్రపతి (1967-69)
13) పాండురంగ్ వామన్ కనే – 1963
ప్రఖ్యాత సంస్కృత పండితుడు.
14) లాల్బహదూర్ శాస్త్రి – 1966
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత రెండో ప్రధాని (1964-66). మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి.
15) ఇందిరాగాంధీ – 1971
1966 – 77, 1980 – 84ల మధ్య భారత ప్రధానిగా పనిచేశారు. ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళ.
16) వి.వి. గిరి – 1975
భారత నాలుగో రాష్ట్రపతి (1969-1974)
17) కె. కామరాజ్ – 1976
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది.
18) మదర్ థెరీసా – 1980
మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను 1950లో ప్రారంభించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
19) వినోబా భావే – 1983
సంఘ సంస్కర్త, భూదాన్ ఉద్యమాన్ని 1951లో ప్రారంభించారు. 1958లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. భారతరత్న మరణానంతరం లభించింది.
20) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ – 1987
ఈయనను ‘సరిహద్దు గాంధీ’గా పేర్కొంటారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1929లో ఖుదాయి కిద్మత్ గార్ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతరత్న అందుకున్న తొలి విదేశీయుడు.
21) ఎం.జి. రామచంద్రన్ – 1988
ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది.
22) బి.ఆర్. అంబేద్కర్ – 1990
భారత రాజ్యాంగ రూపకర్త, సంఘ సంస్కర్త, తొలి న్యాయశాఖ మంత్రి. ఈ అవార్డు మరణానంతరం లభించింది.
23) నెల్సన్ మండేలా – 1990
దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడు. 1993లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈ అవార్డు పొందిన రెండో విదేశీయుడు.
24) రాజీవ్ గాంధీ – 1991
1984 నుంచి 1989 వరకు ప్రధానిగా పనిచేశారు. మరణానంతరం లభించింది.
25) వల్లభాయ్ పటేల్ – 1991
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి హోం శాఖ మంత్రి. మరణానంతరం ఈ అవార్డు లభించింది.
26) మొరార్జీ దేశాయ్ – 1991
1977 నుంచి 1979 వరకు భారత ప్రధానిగా పని చేశారు. తొలి కాంగ్రేసేతర ప్రధాని.
27) మౌలానా అబుల్ కలాం ఆజాద్ – 1992
స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది.
28) జె.ఆర్.డి. టాటా – 1992
టాటా గ్రూప్ చైర్మన్గా పనిచేసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. టీసీఎస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సంస్థలను స్థాపించారు.
29) సత్యజిత్ రే – 1992
ప్రఖ్యాత సినీ దర్శకుడు. 1992లో ఆస్కార్ అవార్డు కూడా లభించింది.
30) గుల్జారీలాల్ నందా – 1997
రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు.
31) అరుణా అసఫ్ అలీ – 1997
స్వాతంత్య్ర సమర యోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరణానంతరం భారతరత్న లభించింది.
32) ఎ.పి.జె. అబ్దుల్ కలాం – 1997
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
33) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి – 1998
ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు. 1974లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత.
34) సి. సుబ్రమణియమ్ – 1998
కేంద్రంలో వ్యవసాయ, ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
35) జయప్రకాశ్ నారాయణ్ – 1999
ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు. ‘లోక్ నాయక్’గా పేర్కొంటారు. జె.పి. అని పిలుస్తారు. 1965లో రామన్ మెగసెసే అవార్డు అభించింది. భారతరత్న మరణానంతరం లభించింది.
36) అమర్త్యసేన్ – 1999
1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
37) గోపీనాథ్ బర్డోలీ – 1999
అసోం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ‘లోక ప్రియ’ అనే బిరుదు ఉంది. భారతరత్న మరణానంతరం లభించింది.
38) పండిట్ రవిశంకర్ – 1999
విఖ్యాత సితార్ విద్వాంసుడు. 1992లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత.
39) లతా మంగేష్కర్ – 2001
ప్రముఖ నేపథ్యగాయని.
40) బిస్మిల్లా ఖాన్ – 2001
ప్రముఖ షెహనాయి విద్వాంసుడు.
41) భీమ్సేన్ జోషి – 2009
ప్రముఖ హిందూస్థానీ గాయకుడు.
42) సి.ఎన్.ఆర్. రావు – 2014
ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి అధ్యక్షులు. సి.వి. రామన్, అబ్దుల్ కలాం తర్వాత భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్త.
43) సచిన్ టెండూల్కర్ – 2014
క్రికెట్ దిగ్గజం. సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు చెప్పిన రోజునే (2013 నవంబర్ 16) భారతరత్న ప్రకటించారు. ఈ పురస్కారం లభించిన తొలి క్రీడాకారుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు.
44) మదన్ మోహన్ మాలవ్య – 2015
ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు. 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ‘లీడర్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. భారతరత్న మరణానంతరం లభించింది.
45) అటల్ బిహారి వాజ్పేయి – 2015
1996లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని 13 రోజుల పాటు నడిపారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవిని అధిష్టించి 13 నెలలు అధికారంలో ఉన్నారు. ఈయన హయాంలో 1998లోనే రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. 1999లో భారత ప్రధానిగా మూడోసారి ఎన్నికై 2004 వరకు కొనసాగారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషిచేశారు. అయితే దురాక్రమణకు పాల్పడ్డ పాకిస్తాన్ను 1999లో కార్గిల్ యుద్ధంలో భారత్ ఓడించింది. నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ ‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో రహదారులను నిర్మించారు. ఈయన హయాంలోనే 2000లో మూడు కొత్త రాష్ట్రాలు (ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్) ఏర్పడ్డాయి. ఈయన పుట్టిన రోజైన డిసెంబర్ 25వ తేదీని కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ సుపరిపాలన దినోత్సవం’గా ప్రకటించింది.
46) ప్రణబ్ ముఖర్జీ…
1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు.
కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. 1987లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 2012, జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు. మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
47) నానాజీ దేశ్ముఖ్…
1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జన్మించిన నానాజీ అసలు పేరు చండికాదాస్ అమృత్రావ్ దేశ్ముఖ్.
పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషి చేసినా నానాజీ దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో ఒకరైన ఆయన 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు.
48) భూపేన్ హజారికా…
ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో జన్మించారు. తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఆయన బ్రహ్మపుత్ర కవి, సుధాకాంతగా పేరొందారు. 1939లో సినిమాలో పాటలు పాడిన హజారికా 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి.
49) కర్పూరి ఠాకూర్ :
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం బీహార్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అయిన కర్పూరి ఠాకూర్ కు (BHARATH RATHNA Karpoori Thakur ) మరణానంతరం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ (24 జనవరి 1924 – 17 ఫిబ్రవరి 1988) బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు . అతను జన్ నాయక్ (ప్రజల హీరోకి హిందీ) అని ప్రసిద్ధి చెందాడు . అతను డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 ( సోషలిస్ట్ పార్టీ / భారతీయ క్రాంతి దళ్ ) వరకు మరియు డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 ( జనతా పార్టీ ) వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
50) ఎల్.కే. అద్వానీ
భారత ప్రభుత్వం లాల్ కృష్ణ అద్వానీ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించింది.
లాల్ కృష్ణ అద్వానీ భారతదేశానికి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా సేవలు అందించారు. అలాగే బిజెపి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. రథయాత్రతో భారతదేశం అంతా యాత్ర చేసి బిజెపి పార్టీని దేశం నలుమూలల వ్యాపింప చేశాడు. అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం తీవ్ర కృషి చేశాడు.