Bhagwant Mann Singh : 14 వేల మంది కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజ్

పంజాబ్ (జూన్ – 11) : పంజాబ్ ముఖ్యమంత్రి Bhagwant Mann Singh 14,000 మంది కాంట్రాక్టు టీచర్ల సర్వీసును రెగ్యులరైజ్ (Regularise) చేయడానికి పంజాబ్ మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ నిర్ణయం ప్రకారం కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న, అనివార్య కార్యణాల వల్ల పదేళ్లకు మించి సర్వీసు చేయలేకపోయిన 14,239 మంది కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయనున్నారు.

వీరిలో కనీసం పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 7,902 మంది, రకరకాల కారణాలతో పదేళ్ల సర్వీసుకు గ్యాప్ వచ్చిన 6,337 మంది ఉన్నారు. కొంత గ్యాప్ కారణంగా పదేళ్లు సర్వీసు పూర్తి చేయలేకపోయిన వారిని కూడా సర్వీసు పూర్తి చేసిన వారిగా పరిగణించి రెగ్యులరైజ్ చేయాలని సీఎం నిర్ణయించినట్టు సీఎంఓ ప్రతినిధి చెప్పారు.