DSC 2024 – 9న ఉపాద్యాయ నియామక పత్రాలు అందజేత – సీఎస్ శాంతి కుమారి

BIKKI NEWS (OCT. 07) : appointement orders newly recruited dsc candidates. తెలంగాణ డీఎస్సీ 2024 లో ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్టు సీఎస్‌ శాంతికుమారి వెల్లడించారు.

appointement orders newly recruited dsc candidates

ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్‌ ఆదివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొంటారని చెప్పారు.

ఇప్పటికే డీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిందని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపుతామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా చూడాలని, బస్సులు సహా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలిచ్చేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు