BIKKI NEWS (NOV. 18) : 50% attendance in group 3 exam. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష తొలిరోజు సగం మంది మాత్రమే హాజరైయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
50% attendance in group 3 exam
ఉదయం పేపర్ – 1 పరీక్షకు 51.1 శాతం, మధ్యాహ్నం పేపర్ – 2 పరీక్షకు 50.7శాతం మాత్రమే హాజరయ్యారని చెప్పారు.
నేడు పేపర్ – 3, అదే హల్ టికెట్ తో వెళ్ళాలి
గ్రూప్-3 పరీక్షల్లో భాగంగా నేడు మూడో పేపర్కు పరీక్షను నిర్వహిస్తారు. మూడో పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
ఈ పరీక్షకు ఆదివారం తీసుకెళ్లిన హాల్టికెట్తోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాలి. కొత్త హాల్టికెట్ను తీసుకెళితే పరీక్షకు అనుమతించరు.