10th EXAMS : మార్చిలో పరీక్షలు – యూడైస్ లో ఉంటేనే అర్హులు

హైదరాబాద్ (అక్టోబర్ 17) : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు.
ఈ సంవత్సరం 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

★ నామినల్ రోల్స్ ఆన్లైన్ లో..

పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ ను ఇక నుంచి ఆన్లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. దీనిని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) లోని విద్యార్థుల డాటాను ప్రామాణికంగా తీసుకొంటారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గుర్తింపు పొందిన పాఠశాలలు తమ వద్ద చదివే విద్యార్థుల డాటాను యూడైస్ ప్లస్ వెబ్సైట్ లో అక్టోబర్ 28లోపు అప్డేట్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సూచించారు. విద్యార్థుల తాలూకు సమగ్ర సమాచారాన్ని పూరించాలని చెప్పారు.