చరిత్రలో ఈరోజు అక్టోబర్ 01

★ దినోత్సవం

  • ప్రపంచ శాఖాహార దినోత్సవం
  • ప్రపంచ వృద్ధుల దినోత్సవం .
  • అంతర్జాతీయ కాఫీ దినోత్సవం
  • జాతీయ రక్తదాన దినోత్సవం.
  • సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్ర్య దినోత్సవం.
  • ప్రపంచ ఆవాస దినోత్సవం.
  • స్వచ్ఛంద రక్తదాన దినం.
  • అంతర్జాతీయ సంగీత దినం.

★ సంఘటనలు

1854: భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలయ్యింది. బిళ్ళల పై రాణి విక్టోరియా గారి మొహం ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వెల సగం ఆణ (రూ. 1/32)
1864: కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు
1880: శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలయ్యింది.
1892: భారత రెండు అన్నా నాణెం చెల్లదు ఇంకా శ్రీలంకలో వెండి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి
1926: బల్కంజీ బారి ఇనిస్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది.
1932: ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు(రైసింగ్డే).
1932: భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది.
1949:’మరాఠీ రంగభూమి’ అనే నాటక సంస్థ స్థాపించబడింది
1953: కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు.
1959: గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
1966: భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
1978: బాల్య వివాహ చట్టంలో, వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు మరియు ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది
1981: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్టు చేశారు
1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984: బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపన.
1990: పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజారిటీ కోసం లోక్‌సభలో మొదటి దశలో విఫలమైంది.
1990: జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
1990: మండల్ కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2001: కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు.
2003: అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం.
2006: పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది

★ జననాలు

1542: మరియం-ఉజ్-జమాని, ముఘల్ చక్రవర్తైన అక్బర్ భార్యలలో ఒకరు
1842: సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్, భారత న్యాయవాది, న్యాయనిపుణుడు (మ. 1924)
1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1861: నీల్ రతన్ సర్కార్ , బ్రిటిష్ భారతీయ వైద్యుడు మరియు విద్యావేత్త. ( మ. 1943 )
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1887: పండిట్ హృదయనాథ్ అజుధియనాథ్ కుంజ్రు, రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త
1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
1894: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977)
1895: లియాఖత్ అలీ ఖాన్ , భారత-పాకిస్తానీ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు, పాకిస్తాన్ 1వ ప్రధానమంత్రి (మ. 1951)
1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
1904: ఎ. కె. గోపాలన్ , భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త (మ. 1977)
1906: సచిన్ దేవ్ బర్మన్, భారతీయ స్వరకర్త మరియు గాయకుడు (మ. 1975)
1906: నికుంజ సేన్ , భారత స్వాతంత్ర్య పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు. (మ. 1986 )
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1913: జనరల్ హర్బక్ష్ సింగ్, పద్మ విభూషణ్ మరియు వీర చక్ర అవార్డు పొందిన భారతీయ సైనిక అధికారి.
1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1918: గోవిందప్ప వెంకటస్వామి , భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006)
1919: మజ్రూహ్ సుల్తాన్‌పురి , భారతీయ కవి మరియు పాటల రచయిత (మ. 2000)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)
1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)
1928:శివాజీ గణేశన్, తమిళ సినీ నటుడు (మ. 2001 )
1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)
1945: రామ్ నాథ్ కోవింద్ , 14వ భారత రాష్ట్రపతి
1947: దల్వీర్ భండారీ , భారతీయ న్యాయవాది మరియు న్యాయమూర్తి
1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
1969: మహేష్ ఠాకూర్, భారత నటుడు
1984: వినీత్ శ్రీనివాసన్ భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత
1990: అనుష్క రంజన్, భారత నేటి, మోడల్
1998: జెహాన్ దారువాలా, భారత ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్

★ మరణాలు

1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)
1986: వీర్ చంద్ర సింగ్ గర్వాలీ, భారతదేశ విప్లవకారుడు.
1995: ఆదిత్య విక్రమ్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త
1997: గుల్ మొహమ్మద్, తను ఉన్నప్పటి కాలంలో ధృవీకరించబడిన అత్యంత పొట్టి మనిషి.
2022: తులసీ తాంతీ, భారతీయ వ్యాపారవేత్త. (జ. 1958)