చరిత్రలో ఈరోజు ఆగస్టు 26

◆ దినోత్సవం

  • మహిళా సమానత్వ దినోత్సవము

◆ సంఘటనలు

1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.

◆ జననాలు

1451: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506)
1743: ఆంటోనీ లెవోషియర్‌, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794)
1873: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే ‘ఫోనో ఫిల్మ్‌’ ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)
1906: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
1910: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997)
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
1956: మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
1963: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008)
1964: సురేష్, తెలుగు సినీ నటుడు.
1965: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.
1968 : సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త.