MTS LECTURES – 8 మంది ఎంటీఎస్ లెక్చరర్ లకు పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు

BIKKI NEWS (JULY 6) – ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో వొకేషనల్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ లు (ఎంటీఎస్) 8 మందిని క్రమబద్ధీకరిస్తూ (MTS LECTURERS REGULARIZATION) తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 20) జారీ చేసిన నేపథ్యంలో వారికి కళాశాలలో పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తూ ఇంటర్మీడియట్ కమీషనర్ నిర్ణయం తీసుకున్నారు.

జీవో నెంబర్ 16 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 8 మంది ఎంటీఎస్ జూనియర్ లెక్చరర్ లను క్రమబద్ధీరిస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.