తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 74 మంది MTS జూనియర్ లెక్చరర్ లను జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరించాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్మీడియట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.
జనరల్ విభాగంలో 22 మంది ఒకేషనల్ విభాగంలో 52 మంది యమ్.టీ.యస్. ,లెక్చరర్ లను క్రమబద్ధీకరించడానికి ఇంటర్ కమీషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

