ఉత్తమ ఫలితాలు, ఉన్నత లక్ష్యాలు పెoపొదించుకోవాలి – బైరి శ్రీనివాస్

BIKKI NEWS (FEB. 17) : ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, జనగామ నందు సెకండ్ ఇయర్స్ విద్యార్థుల కొరకు ఇంచార్జి ప్రిన్సిపాల్ శతి నందిని పటేల్ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశం (gjc dharmakancha farewell party) లో ముఖ్య అతిధిగా విచ్చేసిన జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బైరి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో మంచి ఉత్తమ ఫలితాలు పొంది, ఉన్నత లక్ష్యం ఎంచుకోవడం మంచిదని కోరారు.

ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా పరీక్షల నిర్వహణ అధికారులు ఆంజనేయరాజు, వేముల శేఖర్, కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గట్టు వెంకటేశ్వర్లు, కళాశాల స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ వస్కుల శ్రీనివాస్,అధ్యాపకులు రామస్వామి, ఆఫ్జాల్, రంగన్న, శ్రీకాంత్ రెడ్డి, గణేష్, రజిత, ఇశ్రాత్ భాను, సబిహా బేగం, కాపర్తి శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, ప్రియదర్శిని, రేఖ మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.